నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల పరిధిలో చింతకాని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను తనిఖీ చేసిన మధిర వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్రం & చింతకాని మండల వ్యవసాయ అధికారి ఎస్ మానస . ఈ సందర్భంగా విజయ్ చంద్రం గోదాములో ఉన్న ఎరువుల స్టాక్ రిజిస్టర్, ఫార్మర్ సేల్ రిజిస్టర్ ,బిల్ బుక్, ఇన్వాయిస్ లను మరియు పి వోస్ మిషన్ లో ఉన్న స్టాకును పరిశీలించినారు . తదనంతరం విజయ్ చంద్రం మాట్లాడుతూ మండలంలో రైతులకు యూరియా కొరత లేదని రైతులకు కావలసిన యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని మరియు రైతులు ప్రస్తుతం పంటకు సరిపడా మోతదు మాత్రమే యూరియా వాడుకోవాలని, యూరియా దొరకదని అపోహాలు పెంచుకొని ఇంటిలో యూరియాని నిల్వ పెట్టుకోవద్దని రైతులు ప్రస్తుతం పంటకు సరిపడా మోతదు మాత్రమే యూరియా వాడుకోవాలని, యూరియా ఇంటిలో నిల్వ చేయడం వలన ప్రస్తుతం అవసరం ఉన్న రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సూచించినారు మరియు నానో యూరియా లాభాలు నష్టాలు గురించి రైతులతో విశ్లేషించినారు . ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శేఖర్. సీఈఓ శ్రీనివాసరావు. మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.









