గంధం టవర్స్ వద్ద మురుగు నీరును తొలగించాలి
ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను కాపాడాలి.
సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ
సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మున్సిపాలిటీ పరిధిలోని వైరా – కొత్తగూడెం రోడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, గంధం టవర్స్ వద్ద మురికి నీటిని వెంటనే తొలగించాలని సిపిఐ(ఎం) బ్రాహ్మణపల్లి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ కొత్తగూడెం రోడ్ లో గంధం టవర్స్ వద్ద డ్రైనేజీ నీరు మెయిన్ రోడ్డు పై పంట కాలువలా ప్రవహిస్తుందని అన్నారు. గంధం టవర్స్ అపార్ట్మెంట్ లో దాదాపు 60 కుటుంబాలు ఉంటున్నాయని, వాళ్లందరూ వాడకం చేసిన మురికి నీరు డ్రైనేజీ లేక రోడ్డు మీదకు వస్తున్నాయని అన్నారు. మురికి నీరు జాతీయ రహదారిపై కాలువలా ప్రవహిస్తుందని, విపరీతమైన దుర్వాసన వస్తుందని, ఎదురుగానే అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. వాహానాలు వెళ్ళెటప్పుడు రోడ్డు మీద వెళుతున్న ప్రయాణికులు, బాటసారిలపై మురుగు నీరు పడుతుందని తెలిపారు. మురుగు నీటి నుంచి వచ్చే దుర్వాసనతో అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని, ఎడతెరిపిలెకుండా పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాలు ఇప్పటికే ప్రారంభం అయినాయని, విష జ్వరాల భారీ నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని, వెంటనే డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని, పారిశుధ్యం మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని, వైరా మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణమే ప్రత్యేకమైన నిధులు కేటాయించి వైరా రింగ్ రోడ్డు నుండి వైరా ప్రాజెక్టు అలుగు వాగు వరకు డ్రైనేజీ నిర్మాణం చేసి మురుగు నీరు పంపించే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, బ్రాహ్మణపల్లి శాఖా కార్యదర్శి, వైరా పట్టణ కమిటీ సభ్యులు పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, వేల్పుల మైఖేల్, గుత్తా వాసుదేవరావు, కొంగర నాగేశ్వరావు, చింతోజు నాగేశ్వరావు, వెల్పల రాములు, చావా కళావతి, కొంగర విమల, కాండ్ర రవి తదితరులు పాల్గొన్నారు.









