+91 95819 05907

గ్రామ పంచాయతీ లలో పారిశుధ్య లోపం ప్రబలుతున్న వ్యాధులు పట్టించుకోని అధికారులు: నున్నా.

నేటి గదర్ న్యూస్, వైరా/కొణిజర్ల:

నేడు కొనిజర్ల మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) మండల జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ చింతపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో స్పెషలాఫీసర్ల పరిపాలనలో గ్రామపంచాయతీలు చెత్తకుప్పలుగా మారాయి. ఇటీవల కాలంలో కురిసినటువంటి అధిక వర్షాలు వలన దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిధులు లేవనేటటువంటి నెపంతో గ్రామాల్లో వీధిలైట్లు వేయించడం గాని డ్రైనేజీలు శుభ్రపరచడం గాని బ్లీచింగ్ చల్లడం గానీ దోమల నియంత్రణ కొరకు పాగింగ్ చేయడం గాని కనీసమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కొనిజర్ల మండలంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో సుమారు ఇప్పటికే ఐదుగురు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచే దాని కొరకు విస్తృతమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్న అని అన్నారు. అంతేకాదు గత పదిహేను రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా పెసర,పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయి భూమిలో ఉన్నటువంటి నత్రజని అధిక వర్షాల వల్ల కొట్టుకుపోయి పంటలు వెలవెల బోతున్న సందర్భంలో రైతులు యూరియా బస్తాల కోసం సొసైటీల ముందు రోజులు తరబడి కాపలాకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యల పట్ల తక్షణమే అధికారులు స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ పార్టీ మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు సీనియర్ నాయకులు కొప్పుల కృష్ణయ్య, బోయినపల్లి శ్రీనివాసరావు, మోత్కూరు వెంకటేశ్వరరావు, జోనబోయిన అంజయ్య తాళ్లపల్లి విజయ పగిడిపల్లి కాటయ్య భానోత్ హరిచంద్ పుల్లూరి వెంకటేశ్వర్లు, తేజావత్ సీతారాములు,షేక్ అఫ్జల్ ధారగాని రాములు, నాగేశ్వరరావు,మైబూబ్ అలీ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !