నేటి గదర్ న్యూస్, వైరా/కొణిజర్ల:
నేడు కొనిజర్ల మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) మండల జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ చింతపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో స్పెషలాఫీసర్ల పరిపాలనలో గ్రామపంచాయతీలు చెత్తకుప్పలుగా మారాయి. ఇటీవల కాలంలో కురిసినటువంటి అధిక వర్షాలు వలన దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిధులు లేవనేటటువంటి నెపంతో గ్రామాల్లో వీధిలైట్లు వేయించడం గాని డ్రైనేజీలు శుభ్రపరచడం గాని బ్లీచింగ్ చల్లడం గానీ దోమల నియంత్రణ కొరకు పాగింగ్ చేయడం గాని కనీసమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కొనిజర్ల మండలంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో సుమారు ఇప్పటికే ఐదుగురు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచే దాని కొరకు విస్తృతమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్న అని అన్నారు. అంతేకాదు గత పదిహేను రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా పెసర,పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయి భూమిలో ఉన్నటువంటి నత్రజని అధిక వర్షాల వల్ల కొట్టుకుపోయి పంటలు వెలవెల బోతున్న సందర్భంలో రైతులు యూరియా బస్తాల కోసం సొసైటీల ముందు రోజులు తరబడి కాపలాకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యల పట్ల తక్షణమే అధికారులు స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ పార్టీ మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు సీనియర్ నాయకులు కొప్పుల కృష్ణయ్య, బోయినపల్లి శ్రీనివాసరావు, మోత్కూరు వెంకటేశ్వరరావు, జోనబోయిన అంజయ్య తాళ్లపల్లి విజయ పగిడిపల్లి కాటయ్య భానోత్ హరిచంద్ పుల్లూరి వెంకటేశ్వర్లు, తేజావత్ సీతారాములు,షేక్ అఫ్జల్ ధారగాని రాములు, నాగేశ్వరరావు,మైబూబ్ అలీ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.









