నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి ఆధ్వర్యంలో నూతన జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఏర్పాటు చేయడం జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు కోటేశ్వరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు రబ్బేన్ కట్ చేసి,బీజేపీ జెండా ఆవిష్కరించి భారత జనతా పార్టీ నూతన కార్యాలయమును ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు, ప్రభారీ మందడపు సుబ్బారావు, సీనియర్ నాయకులు మదినేని వెంకటేశ్వర్లు, అనగాని రామారావు, కొరిపెలి శ్రీను, చెన్నూరి నాగచారి, షేక్ సిద్దుమియా, ప్రధాన కార్యదర్శులు గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బక్క సత్యనారాయణ, చింతల కృష్ణ, పులి ప్రవీణ్, యువ మోర్చా మండల అధ్యక్షులు సత్తెనపల్లి గోపి, నాయకులు బూత్ అధ్యక్షులు బల్లి పిచ్చారావు,బుర్ర శ్రీను, పరిచగాని ఎల్లయ్య, నరసింహారావు, వేముల ఎల్లయ్య, నర్సంశెట్టి కృష్ణారావు, బుర్ర శ్రీను, దేశిన్ని గోపాలరావు,ముత్తయ్య, మరియు కార్యకర్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









