మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్ లో నటించిన ఆదివాసి యువకుడు తొలెం శ్రీనివాస్
నేటి గదర్ న్యూస్ ప్రతినిధి: ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన
‘మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి పంచాయతీ దేవనగరం మారుమూల ఆదివాసి గ్రామానికి చెందిన ఆదివాసి యువకుడు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తొలెం శ్రీనివాస్ ఓ పాత్రలో నటించారు. ‘తెలుగు జీ5’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆగస్టు 8న విడుదలైన ‘మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్సరీస్ వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ అందుకుని ట్రెండింగ్లో నిలిచింది. ఈ వెబ్ సిరీస్లో పాత్రలో దుబాయ్ ఏజెంట్ గా మెప్పించారు. చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో 10 వ తరగతి, పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్,ఇల్లెందు లో డిగ్రీ, నల్లగొండలో బీఈడీ, పీజీ ఎంఏ తెలుగు డిస్టెన్స్ లు కాకతీయ యూనివర్సిటీలో పూర్తిచేసిన తోలెం … డైరెక్టర్ బుర్ర శివకృష్ణ,హీరో అనిల్ గిలా ఆశీర్వాదంతో ఈ వెబ్ సిరీస్ నటించే అవకాశం దక్కింది. తాజాగా ఓటీటీలో విడుదలైన మోతెవరి లమ్హ స్టోరీ వెబ్సరీ స్లో నటించి అలరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మారుమూల ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ వెబ్సరీస్లో అలరించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు.









