చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు, గులాబి రంగు పురుగు నివారణ పై అవగాహన సదస్సు శిక్షణ
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలో చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు గులాబీ రంగు పురుగుపై LDC మరియు KYRD సంయుక్త ఆధ్వర్యంలో పత్తి రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయ్ చంద్రం పత్తిలో యాజమాన్యం పద్ధతులు గురించి మాట్లాడుతూ. పత్తి విత్తిన 45 రోజుల నుండి గులాబి రంగు పురుగు ఉనికిని రైతులు గమనించాలని ఆపై లింగ ఘర్షణ బుట్టలు అమర్చి వరుసగా మూడు రోజులు గుట్టలతో 8 తల్లి రెక్క పురుగుల పడటం గమనించిన రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మరియు గడ్డి పూలు ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి అని మరియు మందులు ఉదయం పూట పది గంటలలోపు ఏడు గంటల లోపు పిచికారి చేయాలని వారు సూచించినారు వివరించినారు. తదనంతరం ఎల్ డి సి కంపెనీ ప్రతినిధి మధుసూదన్ రావు మాట్లాడుతూ పత్తి నాణ్యతను పెంచుకోవటానికి గులాబీ రంగు పురుగు నివారణకు లింగ ఘర్షణ బట్టలు పంపిణీ చేస్తున్నామని వారు సూచించినారు.అనంతరం కేవికే కోఆర్డినేటర్ ఇంచార్జి కోఆర్డినేటర్ టీ. పావని మాట్లాడుతూ ప్రతి పంట జనవరి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేనులో ఉంచకూడదని పంటకు నీరు ఎరువులు పెట్టి పంట కాలనీ పొడిగించకూడదని పత్తిలో నాణ్యతను పెంచుకోవడానికి ఈ లింగాకర్శన బట్టలు వీరి వీ గా రైతులు ఉపయోగించాలని సూచించినారు. అదేవిధంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో చింతకాని మండల వ్యవసాయ అధికారి ఎస్ మానస. చింతకాని మండలం వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం.తేజ ఎస్ కే. ఆయేషా ఎండి.తాహియ బి. రాము డి. కళ్యాణి బి.కార్తీక్ మరియు చింతకాని రైతులు తదితరులు పాల్గొన్నారు.









