నిశ్చితార్థం చేసుకున్న యువకుడి శారీరక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న యువతి
మూడునెలల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న యువకుడి నుండి శారీరక వేధింపులు, మానసిక చిత్రహింసలు భరించలేక చివరికి ఆత్మహత్యకు పాల్పడిన యువతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్యతండాకు చెందిన తుళ్లిక శ్రీతో.. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురవాసి బానోతు బిచ్చాకు పెళ్లి చేయాలని నిర్ణయుంచిన పెద్దలు
ఎయిర్పోర్ట్లో ఉద్యోగం.. లక్షకు పైగా జీతం వస్తుందని బిచ్చా చెప్పడంతో బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని భావించి.. కట్నం కింద 60 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు తుళ్లిక శ్రీ తల్లిదండ్రులు
అయితే ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడాలు.. కాల్స్, మెసేజ్లతో తక్కువ టైమ్లోనే దగ్గరైపోవడంతో.. అప్పుడప్పుడు ఇంటికొచ్చి దైవ దర్శనాలకు తీసుకెళ్తానంటే బిచ్చాతో తుళ్లిక శ్రీని తల్లిదండ్రులు పంపడంతో శారీరకంగా కూడా దగ్గరైన జంట
ఈనెల 8న బావ కొడుకు బర్త్డే ఉందంటూ బయటకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయిన బిచ్చా
కూతురు నీరసంగా కనిపించడంతో ఏమైందని తల్లిదండ్రులు అడగడంతో బిచ్చా పెట్టిన టార్చర్ని పూసగుచ్చినట్టు వివరించిన తుళ్లిక శ్రీ
వేరే అబ్బాయి మెసేజ్ పెడితే.. సంబంధం అంటగట్టి దారుణంగా కొట్టాడని కన్నీటిపర్యంతమైన తుళ్లిక శ్రీ .. ఇక పెళ్లి చేసుకునేది కూడా లేదని.. చస్తే చావంటూ మెసేజ్ పెట్టిన బిచ్చా
దీంతో తీవ్ర మనస్థాపానికి గురై.. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న తుళ్లిక శ్రీ
గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి తుళ్లిక శ్రీ మృతి









