నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమాలకు తక్షణమే నిధులు కేటాయించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలేటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సి పి ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చింతకాని మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోలేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్షాకాల సీజన్ ప్రారంభమై గ్రామాల్లో చెత్తాచెదారం మురిగి ఈగలు దోమలు తో గ్రామాలు మురికి కోపాలుగా మారాయని. మురుగు కాలువల్లో డ్రైనేజీ సమస్యలు ఉత్పన్నమై మురుగునీరు రోడ్లపై పారుతున్నది కాళీ ప్రదేశాల్లో పిచ్చి చెత్త పెరిగి వాటిల్లో తేలు పాములు నివాసాలుగా మారి వర్షాలు కురిసినప్పుడు అవి ఇంటిలోకి వస్తున్నాయి అని. మురుగనీరు ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వల్ల విష జ్వరాలు డెంగ్యూ,మలేరియా, టైపాడ్, తదితర వ్యాధులు విజృంభిస్తున్నాయి అని వ్యాధుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ కోసం తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం మండల అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ. రఘునాథపాలెం చింతకాని సంయుక్త మండలాల కార్యదర్శి కే లోతు లక్ష్మణ్. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.









