+91 95819 05907

వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. గ్రామ బొడ్రాయి వద్ద ముఖ్యమంత్రి గారు పూజలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు.

🪴గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలతో ముఖ్యమంత్రి గారు కొద్దిసేపు ముచ్చటించారు. ఆ ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి చాప మీద కూర్చొని వారిచ్చిన అల్పాహారం తీసుకున్నారు. గృహ ప్రవేశం చేసిన ఆడబిడ్డలు బచ్చల నర్సమ్మ, బచ్చల రమణమ్మ కుటుంబాలకు చీరలను బహూకరించారు. గృహ ప్రవేశం చేసిన సందర్భంగా కుటుంబ సభ్యుల అనుభూతిని అడిగి తెలుసుకున్నారు.

🪴అనంతరం స్థానికులతో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడి వారి బాగోగులను అడిగారు. అందరూ సంతోషంగా ఉన్నారా. సన్నబియ్యం వస్తున్నాయా. రేషన్ కార్డులు వచ్చాయా అంటూ వాకబు చేశారు. ఈ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని ప్రశ్నించినప్పుడు 312 ఇండ్లు మంజూరైనట్టు ఆనందంగా చెప్పారు.

🪴ఇండ్లు మంజూరైన వారంతా సంతోషంగా, చల్లగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తూ పిల్లలను బాగా చదివించాలని, వారికి పెళ్లిళ్లయ్యాక వారికీ ఇండ్లిస్తామని చెప్పారు. గృహ ప్రవేశం చేసుకున్న ముహూర్తాన చిరు జల్లులు కురవడం శుభసంకేతమని అన్నారు.

🪴గడిచిన పదేండ్లలో ఏటా రెండు లక్షల ఇండ్లు కట్టినా రాష్ట్రంలో ఇప్పటికి 20 లక్షల ఇండ్లు పూర్తయ్యేవని అన్నారు. అలా చేయకపోవడంతో పేదవారి ఆశలు అడియాసలయ్యాయని అన్నారు. తమ ప్రభుత్వం మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని చెబుతూ, వచ్చే రెండేండ్లలో మరో 4.5 లక్షల ఇండ్లిస్తామని ప్రకటించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !