నేటి గదర్ న్యూస్:
డాక్టర్ సర్వేపల్లి రాధాకృషన్ జయంతి సెప్టెంబర్ 5న జరుగు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని ఎంపీపీస్ గుదిమళ్ళ ప్రాథమిక పాఠశాల లో 5వ విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఉంటూ మిగతా తరగతుల విదార్థులకు బోధన చేయుట జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీ.కళ్యాణి మాట్లాడుతూ…. విద్యార్థులకు చక్కని విద్యాబుద్ధులు నేర్పే ప్రతి టీచర్ ఉత్తమ ఉపాధ్యాయుడేనని అభివర్ణిం చారు. ఉపాధ్యాయ వత్తి ఎంతో పవిత్రమైన దని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చక్కని విద్యా బుద్ధులు నేర్పడం తమకు దేవుడిచ్చిన వరంగా భావిస్తా మని తెలిపారు.ఉపాధ్యాయులు శ్రీలక్మి,ధరావత్ రాములు,A.ధనలక్ష్మి,D.వెంకటేశ్వర్లు,B.శంకర్ తదితర్లు పాల్గొనారు.
Post Views: 36









