చింతకాని మండలం లో పర్యటించిన డా.రామనాథం.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండలం లచ్చగూడెం మరియు నేరడ గ్రామాల్లో పత్తి మరియు పెసర పూర్తిగా దెబ్బతిన్న పంటలను చింతకాని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా టిడిపి పార్లమెంటరీ పార్టీ అడ హగ్ కమిటీ కన్వీనర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ తుఫాన్లు భారీ వర్షాలకు కారణంగా జిల్లాలో పత్తి పెసర వేసిన రైతులు దారుణంగా దెబ్బతిన్నారని,కోతకు వచ్చిన పెసర పూర్తిగా దెబ్బ తిని రైతుకు దక్కకుండా అయినదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యవసాయ అధికారులు సర్వే చేసి రైతాంగానికి నష్టపరిహారం అందించాలని కోరారు. తదనంతరం చింతకాని మండల వ్యవసాయ అధికారి మానస కి పంట నష్టం గురించి వివరించి తక్షణమే పంటల నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కోరారు. జిల్లా నాయకులు మందడపు సుధాకర్ మాట్లాడుతూ నష్టపోయిన పెసర పంటను మార్క్ ఫైడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే దెబ్బతిన్న పెసర పంటకు ఎకరాకు 15000 రూపాయలు అలాగే పత్తి పంటకు 20 వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అలాగే పంట బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా సహాయం అందే విధంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నష్టపోయిన బాధిత రైతులను కౌలు రైతుల సమస్యలను వినడం జరిగినది అనంతరము పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని చింతకాని తాసిల్దార్ కి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు,బోనకల్ మండల టిడిపి అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ,చింతకాని మండల టిడిపిమాజీ అధ్యక్షులు నున్న తాజుద్దీన్,ఉపాధ్యక్షులు,నన్నక రామారావు,మండల రైతు నాయకులు పెంట్యాల రామారావు, సీనియర్ నాయకులు నన్నక గోపాలరావు,గంట సత్యనారాయణ గురజాల మాధవ,తాళ్లూరు శేషయ్య ,తాళ్లూరి రాము, ముప్పాళ్ళ కోటయ్య,దాసరి లక్ష్మీ, నరసయ్య కిషోర్ చౌదరి పగిడిపల్లి పానకాలు ఏసు,పోగు రాంబాబు ముప్పాళ్ళ కోటయ్య, కొనకంచి లక్ష్మీనారాయణ, సురేషు,మల్లెల సత్యనారయణ, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.









