*స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి*
*బీఆర్ఎస్ పార్టీ అభ్యుర్థులను గెలిపించాలి*
*కార్యకర్తలకు అండగా నేను ఉంటా*
*పలువురు కాంగ్రెసు నాయకులు బీఆర్ఎస్ లో చేరిక*
*బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు*
నేటి గదర్ కరకగూడెం:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని,సెప్టెంబర్ 10,11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పర్యటను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గురువారం కరకగూడెం మండలంలోని స్పందన గార్డెన్ నందు కరకగూడెం,ఆళ్లపల్లి,
గుండాల మూడు మండలాల స్థాయి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ముఖ్యాతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు హజరై,మాట్లాడుతూ ఆరు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని,ప్రజలను గాలికి వదిలేసారని ఆవేదం వ్యక్తం చేశారు.ఇందిరమ్మ ఇల్లు పేర్లతో ప్రజలను ఆశ పెడుతున్నారని,ప్రజలు ఎవరు కూడా నమ్మి మోసపోద్దని,ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకాలని అన్నారు.రైతుల పండించే పంటలకు సకాలంలో ఎరువులు కూడా ఇవ్వకుండా నాయకులు ఈ ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.కేసిఆర్ ప్రభుత్వంలో రైతులను కళ్ళల్లో పెట్టి చూసుకున్నారని సూచించారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ,స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు,జడ్పీటీసి,ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్ధులే పూర్తి స్థాయిలో గెలుపొందేలా పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. అనంతరం కరకగూడెం,ఆళ్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు,మాజీ జెడ్పిటిసిలు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,సొసైటీ అధ్యక్షులు,సొసైటీ డైరెక్టర్లు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









