+91 95819 05907

కేటిఆర్ పర్యటను విజయవంతం చేయాలి :రేగా

*స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి*
*బీఆర్ఎస్ పార్టీ అభ్యుర్థులను గెలిపించాలి*
*కార్యకర్తలకు అండగా నేను ఉంటా*
*పలువురు కాంగ్రెసు నాయకులు బీఆర్ఎస్ లో చేరిక*
*బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు*
నేటి గదర్ కరకగూడెం:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని,సెప్టెంబర్ 10,11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పర్యటను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గురువారం కరకగూడెం మండలంలోని స్పందన గార్డెన్ నందు కరకగూడెం,ఆళ్లపల్లి,
గుండాల మూడు మండలాల స్థాయి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ముఖ్యాతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు హజరై,మాట్లాడుతూ ఆరు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని,ప్రజలను గాలికి వదిలేసారని ఆవేదం వ్యక్తం చేశారు.ఇందిరమ్మ ఇల్లు పేర్లతో ప్రజలను ఆశ పెడుతున్నారని,ప్రజలు ఎవరు కూడా నమ్మి మోసపోద్దని,ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకాలని అన్నారు.రైతుల పండించే పంటలకు సకాలంలో ఎరువులు కూడా ఇవ్వకుండా నాయకులు ఈ ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.కేసిఆర్ ప్రభుత్వంలో రైతులను కళ్ళల్లో పెట్టి చూసుకున్నారని సూచించారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ,స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు,జడ్పీటీసి,ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్ధులే పూర్తి స్థాయిలో గెలుపొందేలా పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. అనంతరం కరకగూడెం,ఆళ్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు,మాజీ జెడ్పిటిసిలు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,సొసైటీ అధ్యక్షులు,సొసైటీ డైరెక్టర్లు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !