నేటి గదర్ కరకగూడెం: ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు తక్షణమే పెంచాలని జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందిని రెండో పిఆర్సి పరిధిలోకి తీసుకొని వేతనాలు ప్రతినెల గ్రీన్ ఛానల్ ద్వారా పెండింగ్ లేకుండా ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మిక సంఘం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు గుమ్మడివెళ్లి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని పంచాయతీ కార్మికులు ఆరకొర వేతనాలతోనే జీవనం సాగిస్తున్నారని కరోనాకాలంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేసినప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో కొంత వివక్ష గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని మరికొన్ని డిమాండ్ తో కూడిన వినతిపత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు గాంధర్ల ధనంజయ్ పంచాయతీ కార్మికులు శంకర్, సత్యనారాయణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.









