+91 95819 05907

పినపాక జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

పినపాక, సెప్టెంబర్ 06:

పినపాక మండలంలోని పినపాక జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టు డే సందర్భంగా.
మానవతా దృక్పథంతో *పినపాక జర్నలిస్టుల సంఘం* మరోసారి తమ సేవా కార్యక్రమంతో చాటుకుంది. మండలంలోని పినపాక గ్రామానికి చెందిన కొండ్రు వీరయ్య, w/o సుశీల.
ప్రధానుడు ఆకస్మికంగా కన్నుమూసిన నేపథ్యంలో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని గమనించిన పినపాక జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు ముందుకు వచ్చి సహాయం అందించారు.
సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన జర్నలిస్టులు, సంఘం ఎల్లప్పుడూ ప్రజల పక్కనే ఉంటుందని, అవసరమైన చోట సహాయం చేసేందుకు ముందుంటుందని హామీ ఇచ్చారు. బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా భవిష్యత్తులో కూడా తగినంత సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
సంఘం నాయకులు మాట్లాడుతూ – “జర్నలిస్టు అంటే కేవలం వార్తలు రాయడమే కాదు, సమాజానికి అవసరమైన సందర్భంలో అండగా నిలబడటమూ బాధ్యతే” అని అభిప్రాయపడ్డారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టి, ప్రజల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పినపాక జర్నలిస్టుల సంఘం గౌరవ సలహాదారు, యాగమాటి గంగాధర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు, కొత్త దామోదర్ గౌడ్ క్లబ్ అధ్యక్షులు సత్ర పల్లి సారయ్య, ఉపాధ్యక్షులు వాగబోయిన సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి అత్తె లక్ష్మణ్, కోశాధికారి, కన్నె రమేష్ కమిటీ సభ్యులు, గోడిశాల చంద్రం, రాము గ్రామస్తులు పాల్గొని సహాయాన్ని అందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !