*నేటి గదర్ న్యూస్ గుండాల*, పి వై ఎల్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పి వై ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పరిషిక రవి కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 25,26 తేదీలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సదస్సును శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తుందని అన్నారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులకు పార్టీ ప్రముఖులు హాజరై ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ మండల నాయకులు తాటి రమేష్, ప్రమోద్, రామారావు, రమేష్, ప్రభాకర, వినోద్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 130









