ఎం.పీ.డీ.ఓ, ఎం.ఆర్.ఓలను మర్యాదపూర్వకంగా కలిసిన సోయం వీరభద్రం మరియు సర్పంచ్ల బృందం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం మరియు మండల రెవెన్యూ కార్యాలయాల్లో బి.ఆర్.ఎస్ నాయకులు సోయం వీరభద్రం ఆధ్వర్యంలో బుధవారం అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎం.పీ.డీ.ఓ రవీందర్ రెడ్డి మరియు నూతన ఎం.ఆర్.ఓ రామ్ నరేష్ యాదవ్లను వారి ఛాంబర్లలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ పంచాయతీల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నాయకులు, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, పంచాయతీ రాజ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్ముగూడెం సర్పంచ్ సోయం సత్యవతి, పార్కెలగండి సర్పంచ్ కొమరం సుశీల, తాటిసుబ్బన్నగూడెం సర్పంచ్ సవలం స్వాతి, గున్నేపల్లి సర్పంచ్ తొగత్త అనిత, మరియు పెద్ద గొల్లగూడెం సర్పంచ్ యట్ల రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు.








