+91 95819 05907

తెలంగాణలో యూరియా కొరత నివారించాలి -అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్

దమ్మపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. పోడు భూములపై అటవీ అధికారుల చర్యలు ఖండించిన సంఘం.

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 18: రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైన యూరియాను ప్రభుత్వం తక్షణమే పంపిణీ చేయాలని, పోడు భూముల్లో అటవీ అధికారులు పంటలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎఐయుకెఎస్) ఆధ్వర్యంలో దమ్మపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ గత కొంతకాలంగా రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు రాత్రింబవళ్లు సహకార కార్యాలయాల ముందు ఎదురుచూస్తున్నా యూరియా దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే యూరియాను అందించాలి, పత్తిపై ఎత్తివేసిన 11% సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి, పత్తికి కనీస మద్దతు ధర రూ. 10,075గా నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోడు భూముల్లో రైతులు పండించిన పంటలను అటవీ అధికారులతో ధ్వంసం చేయిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇది కొనసాగితే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అతివృష్టి కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాలి, వృద్ధాప్య పింఛన్లను రూ. 4,000, వికలాంగుల పింఛన్లను రూ. 6,000 కు పెంచుతామన్న ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం పాల్వంచ డివిజన్ అధ్యక్షుడు పండూరి వీరబాబు, డివిజన్ నాయకులు వగ్గేల ప్రసాద్, మండల అధ్యక్షులు కుంజా కాంతారావు, తామ రాముడు, కుంజ పాపారావు, బండి ఆదినారాయణ, చాప ముత్యాలరావు, కేసరి వెంకటేష్, గంగాధర నాగమణి, తెల్లం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !