+91 95819 05907

మూడేళ్ళలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు -మంత్రి పొంగులేటి

ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారం, సంక్షేమ పథకాల పంపిణీలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 24: రాబోయే మూడు సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అశ్వారావుపేటలోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఆత్మ కమిటీ’ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగాలేకపోయినా, పేదలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రతి సోమవారం జమ చేస్తామని చెప్పారు. ఈ చర్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు ప్రతిబింబమని, పేదలు ఎక్కడా తలదించుకోకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఆత్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అశ్వారావుపేటలో 966 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, అలాగే 19 మంది కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు రూ. 19,02,204 విలువైన చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం రాష్ట్రంలోనే మొదటిసారిగా అశ్వారావుపేటలో జరగడం సంతోషకరమని అన్నారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. రైతులు, ఇళ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆత్మ కమిటీ సభ్యులు వ్యవసాయ సంబంధిత సబ్సిడీ పథకాల అమలులో పారదర్శకతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !