*రైతు ప్రయోజనాల కోసం ఆత్మ కమిటీ కృషి చేయాలి — ఎమ్మెల్యే జారె*
*కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు*
అశ్వారావుపేట మండలకేంద్రంలో శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్లో గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు గారు ఆత్మ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు మరో 25 మంది ఆత్మ కమిటీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారితో కలసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలలో భాగంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అదనంగా మంజూరైన 1000 ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల అర్హత పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









