సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే సంఘటన
కర్ణాటక – హోస్పేట్ శివారులో గత నెల 28న XL వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గంగాధర అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
గంగాధర పక్షవాతంతో బాధపడుతున్నాడని, అతను బండి నడిపే స్థితిలో లేడని అతని భార్య తెలపడంతో రంగంలోకి దిగిన పోలీసులు
హోస్పేట్లోని గంగావతి ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కృష్ణ, బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్, గోసంగి రవి, అజయ్, రియాజ్ ముఠాగా ఏర్పడి పథకం పన్ని హత్య చేసినట్లు ఛేదించిన పోలీసులు
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధరకి రూ.5 కోట్ల జీవిత బీమా, రూ. 25 లక్షల ప్రమాద బీమా చేయించి, నామినిగా హులిగెమ్మ అనే ఓ మహిళను ఒప్పించి అతని భార్యగా పరిచయం చేసిన ఈ ముఠా
గంగాధర చనిపోయేలా లేడని, ప్రమాద బీమా రూ.25 లక్షల కోసం హత్య చేయాలని నిర్ణయించుకొని, కిడ్నాప్ చేసి, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
మృతుడి భార్య అనుమానంతో లోతుగా పరిశీలించి, కిల్లర్ ముఠాను పట్టుకున్న పోలీసులు
ఇంతకు ముందు కూడా ఇలా బీమా డబ్బుల కోసం ఏమైనా హత్యలు చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు









