+91 95819 05907

కాంగ్రెస్ దగ్గర డబ్బు ఉంటే … బీ ఆర్ ఏస్ వెంట ప్రజలు ఉన్నారు : రేగా

​కాంగ్రెస్ దగ్గర డబ్బుంటే బిఆర్ఎస్ వెంట ప్రజలు ఉన్నారు -రేగ కాంతారావు

​దమ్మపేట బిఆర్ఎస్ నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పాలనపై రేగ, మెచ్చా విమర్శలు

మోసం చేయడమే కాంగ్రెస్ నైజం – మెచ్చా

నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, అక్టోబర్, 03: ​స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల స్థాయి నాయకుల సమావేశం నేడు మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో పార్కలగండిలోని కొబ్బరి తోటలో ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ​సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ దగ్గర డబ్బుంటే, బిఆర్ఎస్ వెంట ప్రజలు ఉన్నారు” అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాలకు పంచుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం గెలుపు బిఆర్ఎస్ అభ్యర్థులదే అని ఆయన స్పష్టం చేశారు. ​ ​అనంతరం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ, “మోసం చేయడమే కాంగ్రెస్ నైజాం” అని తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల సంగతి ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులు ఏ మొహం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ​ఈ సందర్భంగా పట్వారీగూడెం పంచాయతీకి చెందిన బుల్లా నాగరాజు, వాడే వసంత్, కొమరం వెంకటేశ్వరరావు, కుర్సం మారప్ప, కాసిని బాలాజీ, బందెల నాగరాజుతో పాటు గణేష్ పాడు నుంచి ఎర్రగొర్ల సాయి, దురదపాడు నుంచి కుర్సం కవిత కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరావు, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జున రావు, నియోజకవర్గ నాయకులు సోయం విరభద్రం, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, పార్టీ మండల నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !