కారేపల్లి నేటి గద్దర్ ప్రతినిధి:
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కేంద్రంలో మంగళవారం నాడు కొమరం భీమ్ 85 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బచ్చల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జల్ – జంగిల్ -జమీన్ అనే నినాదంతో బ్రిటిష్ ప్రభుత్వంపై నిజాం నిరంకుశ పాలనపై జంగు సైరన్ మోగించిన ఆదివాసి ఆరాధ్య దైవం గోండ్ బొబ్బిలి మా ఆదివాసి పోరాట యోధుడు కొమరం భీమ్ దాదా కి ఖమ్మం జిల్లా తుడుందెబ్బ తరుపున అలాగే ఆదివాసి సమాజం తరఫున ఘన నివాళ్ళు అర్పించారు ఆదివాసి హక్కుల పోరాటాలకు నిత్యం స్ఫూర్తినిచ్చేటువంటి వీరుడు కొమరం భీమ్ అని ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు ఈ కార్యక్రమంలో కల్తీ రాంప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్bఈసాల రాంబాబు ఎదలపల్లి శీను తాటి రామారావు కారేపల్లి మండల అధ్యక్షుడు కుర్సం సత్యనారాయణ మాజీ సర్పంచ్ సాగబోయిన వెంకటమ్మ మాజీ సర్పంచ్ దారం సహదేవులు ఈసాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు









