*ఒక ఉపాధ్యాయుని చేతిలో ఎంతోమంది బాగుపడ్డారు కానీ తన కొడుకు మాత్రం జీవనోపాధి కోసం గవర్నర్ కు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం కోసం ఓ నిరుద్యోగి గా విన్నపించిన కనికరించని ప్రభుత్వం**
జీవనోపాధి కోసం హైదరాబాదు వలస
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి( భూపాల్ మాదిగ) అక్టోబర్ 7.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని ఒక నిరుపేద కుటుంబంలో కటిక దరిద్రం లో ఉన్నటువంటి వ్యక్తి కథ మాసాయిపేట మండల కేంద్రంలోని రాధాకృష్ణ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు మరోవైపు ఉద్యోగం లేదు. ఉపాధి కోసం నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వలస వెళ్లిన వ్యక్తి ఎన్నో తిప్పలు పడి ఒక ప్రైవేటు ఆఫీసులో ఆఫీసు అసిస్టెంట్గా చేరి గత నాలుగు సంవత్సరాలు 13,500 జీతంతో హైదరాబాద్ నగరంలో బత్కేల్ల తీస్తున్నారు. గత ఏడాది ఉద్యోగులను తొలగించే క్రమంలో ఆఫీసులో ఉద్యోగం నుంచి నాలుగు సంవత్సరాలు ప్రాబడెంట్ పండు ఈఎస్ఐ కట్ చేయకుండా జీతం మరియు ఎలాంటి ఆర్థిక సపోర్టు లేదని ఆవేదన వ్యక్తం చేసిన రాధాకృష్ణ అక్కడితో ఆగకుండా ప్రధానమంత్రి కార్యాలానికి తెలంగాణ ముఖ్యమంత్రి కి చాలా సార్లు ఆర్థిక సాయం కోసం విన్నవించుకున్నానాని అలాగే తెలంగాణ గవర్నర్ కు కూడా ఆర్థిక సాయం కోసం విన్నవించుకునానని మాసాయిపేట నివాసి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.ఎక్కడి నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో అత్యంత దుర్భరమైన దుస్థితిలో ఉన్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క కటిక పేదరికం మరోపక్క తినడానికి కూడా ఇబ్బంది ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవలని ముఖ్యమంత్రి కార్యాలయం లో ఉత్తరాలు ట్విట్టర్లు మెయిల్ ద్వారా ఎన్నో పర్యాయాలు ఆర్జీ పెట్టుకున్న ఇంతవరకు సమాధానం రాలేదు అనిఅన్నారు. ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఇబ్బంది వస్తే ఆదుకోవాల్సింది ఆ రాష్ట్రాన్ని పరిపాలించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నేను పెట్టుకున్న ఆర్జీలు ముఖ్యమంత్రి దాకా వెళ్లడం లేదా లేక అధికారులు చూసి దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం లేదా అని అన్నారు. నేను ఇచ్చినా పిర్యాదులు ప్రశ్నగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి ఆయన విచక్షణ అధికారము ఉపయోగించి ఆర్థిక సాయం చేయగలరని పత్రికా ముఖంగా వేడుకుంటున్నాను. అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పేదవాన్ని ఆదుకోండి ఒక కుటుంబాన్ని నిలబెట్టండి గ్రామంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఉన్న నివాసం ఉన్న ఇల్లు భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నది విపత్తు నివారణ కింద ఎలాంటి డబ్బులు రాలేదు తల్లి తండ్రి ఎలాంటి బ్యాగ్ సపోర్ట్ లేదుఅని ఒక సామాన్య వ్యక్తిని ఎలాంటి రాజకీయ పలుకుబడి గాని ఎలాంటి రాజకీయ అండర్ దండలు గాని లేనటువంటి చివరగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ని ఒక పేద వ్యక్తిని ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే ప్రస్తుతం మెదక్ ఎంపీ రఘునందన్ రావు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మరియు కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆర్థిక సాయం చేసి నన్ను ఆదుకోండి అని విజ్ఞప్తి చేశారు.









