భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 18న తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.
బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 42 శాతం చట్టాన్ని గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేయడాన్ని, అలాగే బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సంఘం తీవ్రంగా తప్పుపట్టింది.
నాయకులు పేర్కొంటూ, గత 70 సంవత్సరాలుగా బీసీలు రాజకీయంగా అంచు వేయబడుతూ అంటరానితనాన్ని అనుభవిస్తున్నారని, ఈ అన్యాయాన్ని ఇక సహించబోమని హెచ్చరించారు.
బీసీలకు రాజకీయ న్యాయం చేయకపోవడం, చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం అనేది బహుజన సమాజానికి అవమానమని వారు పేర్కొన్నారు.
బీసీల హక్కుల సాధన కోసం సమగ్ర పోరాటం కొనసాగుతుందని, అందులో భాగంగానే అక్టోబర్ 18న తెలంగాణ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బహుజన నాయకులు ప్రజలందరినీ, వ్యాపార వర్గాలను, ఉద్యోగులను బంద్ విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు
ఈ సమావేశంలో పాల్గొన్న వారు:
కొదుమూరి సత్యనారాయణ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి),
కురిమెల్ల శంకర్ (జిల్లా అధ్యక్షులు),
భూపతి శ్రీనివాసరావు (జిల్లా ప్రధాన కార్యదర్శి),
బండి రాజ గౌడ్ (జిల్లా ఉపాధ్యక్షులు),
తూముల శ్రీనివాస్ జిల్లా గౌరవ అధ్యక్షులు,
పితాని సత్యనారాయణ ( జిల్లా కోశాధికారి),
మహమ్మద్ జాహిద్
జిల్లా మైనార్టీ అధ్యక్షులు
కాసోజు రాజేశ్వరి (రాష్ట్ర నాయకురాలు),
కొంపల్లి మునీల మహిళ (జిల్లా అధ్యక్షురాలు),
మల్లెల ఉషారాణి (గౌరవ సలహాదారి) తదితరులు పాల్గొన్నారు









