+91 95819 05907

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత అందించాలి.

గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

జన్నారం పాఠశాలలో జివి రామన్ జన్మదిన వేడుకలు

నేటి గదర్ న్యూస్, వైరా/ ఏన్కూర్:-
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు చేయూత అందించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. మార్పు స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు దంపతుల పెద్ద కుమారుడు గుడిమెట్ల వెంకట రామన్ జన్మదినాన్ని మంగళవారం ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. జన్నారం ఎంపిపిఎస్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్నులు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలకు కావలసిన సౌకర్యాలు, వసతులు ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. చదువును కొనుక్కోలేని నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, పేద విద్యార్థుల చదువుకు చేయూత అందించాలని, బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు నిలయాలైన ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు తూము సుధాకర్, జన్నారం మాజీ ఉప సర్పంచ్ అడపా రామారావు, గార్లఒడ్డు సొసైటీ ఉపాధ్యక్షులు రేగళ్ల తిరుమలరావు, రైతు సంఘం మండల నాయకులు నేలపట్ల బాబు, పచ్చకాయల వెంకన్న, సంపసాని వెంకటేశ్వర్లు, జన్నారం ఎంపిపిఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు సాధం దివ్య, ఉపాధ్యాయురాలు కుదురుపాక నాగమణి, అంగన్వాడీ టీచర్ సరస్వతి, మార్పు స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల వెంకట రమణ, గుడిమెట్ల తిరుపతయ్య, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !