+91 95819 05907

డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడికి హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ?కల్తీ డయాలసిస్‌తో హెచ్ఐవి ముప్పు?

*🔥డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు… !*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్లిన *60 ఏళ్ల వృద్ధుడికి గత నెలలో రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది.* బాధితుడు ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలకు రక్త శుద్ధి కోసం వెళ్లే కిడ్నీ రోగులు కొత్త రోగాల బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. *సరైన హాట్ డిసిన్ఫెక్షన్ చేయకపోవడం వల్లే హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.* అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడికి గత నెలలో రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. *బాధితుడు ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.* గతంలోనూ ఇలా డయాలసిస్ ద్వారా ఇతర వ్యాధులు సోకిన బాధితులు ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. డయాలసిస్ కేంద్రాలపై వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడటంతో నిర్వహణ గందరగోళంగా మారింది.

*కల్తీ డయాలసిస్‌తో హెచ్ఐవి ముప్పు:*
డయాలసిస్ పూర్తయిన తర్వాత ప్రతి యంత్రానికి అరగంట పాటు హాట్ డిసిన్ఫెక్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని కేంద్రాలలో రద్దీ కారణంగా సమయం లేక దీనిని సరిగా చేయడం లేదని, మరికొన్ని చోట్ల అసలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ఒక రోగికి వాడిన రక్తపు ట్యూబ్‌ల నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకుతోంది. నిబంధనల ప్రకారం.. ఒక్కో డయాలసిస్‌కు ఒక సింగిల్ డయలైజర్ మాత్రమే వాడాలి. కానీ కొన్ని కేంద్రాలలో సిబ్బంది ఒకే డయలైజర్‌ను రెండు మూడుసార్లు వాడుతున్నారని.. మిగిలిన వాటిని ప్రైవేట్‌గా అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

డయాలసిస్ రోగులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్ఐవీ, హెచ్‌సీవీ వంటి వైరల్ మార్కర్ పరీక్షలు ఈఎల్ఐఎస్ఏ (ELISA) పద్ధతిలో చేయాలి. కానీ చాలా కేంద్రాలు స్ట్రిప్ పద్ధతిలో చేస్తున్నాయని, దీనివల్ల ఫలితాలలో సరైన కచ్చితత్వం ఉండటం లేదని రోగులు చెబుతున్నారు. ప్రభుత్వం డయాలసిస్ సేవలను ప్రైవేట్ సంస్థలకు పీపీపీ (PPP) పద్ధతిలో అప్పగించింది. అయితే.. మేనేజ్‌మెంట్ కంపెనీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని.. కొన్ని కేంద్రాలలో సిబ్బంది డయాలసిస్ స్లాట్‌ల కోసం రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సీనియర్ అధికారులు వెంటనే తనిఖీలు చేసి సమస్యలను పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !