దీపావళి సందర్భంగా జాగ్రత్తలు తప్పనిసరి
– ఈ బయ్యారం క్రాస్ రోడ్ వర్తక సంఘం అధ్యక్షులు గుండు సురేష్
పినపాక
దీపావళి సందర్భంగా టపాసులు అమ్మే వ్యాపారస్తులు, ఇళ్లలో టపాసులు పేల్చే ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఈ బయ్యారం వర్తక సంఘం అధ్యక్షులు సురేష్ తెలియజేశారు. ఆదివారం సాయంత్రం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో వర్తక సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు . టపాసులు దుకాణదారులు పోలీసులు, ఫైర్ సిబ్బంది సూచించిన నియమ నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. కచ్చితంగా టపాసులోనే ప్రదేశాల్లో డ్రమ్ము నీళ్లు, ఇసుక ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్క దుకాణాల దారుడు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వర్తక సంఘం సభ్యులు ఉపాధ్యక్షులు లక్ష్మణాచారి , సాయిబాబా, ఆకుల సత్యనారాయణ, లక్ష్మణ్, వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 31









