నేటి గదర్ న్యూస్, 21 అక్టోబర్ 2025, ఎర్రుపాలెం ప్రతినిధి.
రైతులు బతుకులు అగమ్య గోచరంగా ఉంటే నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
మధిర నియోజవర్గం లోని రైతులను పట్టించుకొని భట్టి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రైతుల పక్షాన సీపీయం పోరాడుతుంది
ఈ రోజు మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం మామునూరు,భీమవరం లో సీపీయం నాయకులు పర్యటించి రైతుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.అకాల వర్షాలకు పత్తి రైతులు బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి అని పత్తి రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అందుకొని ఎటువంటి ఆంక్షలు లేకుండా క్వింటా కి మద్దతు ధరతో సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి అని సిపియం మధిర డివిజన్ సెక్రటరీ మడుపల్లి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపియం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ ఎర్రుపాలెం మండల లో వరి పంట పదివేల ఎకరాలు పైన రైతులు సాగు చేస్తున్నారు.ఒక ఎకరానికి 40 బస్తాలు దిగుబడి రావాల్సిన వరి పంట అకాల వర్షం, అతివృష్టి తో వరి కి చీడపీడలు తో ఎండు తెగులు వ్యాధి సోకి. వరి పంట మొత్తం దెబ్బతిని 15నుంచి 20. బస్తాల మధ్య దిగుబడి వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నది కాబట్టి.స్థానికం గా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలి అని కోరారు.రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధి తో రైతులను అదుకోకా పోతే సీపియం ఆధ్వర్యం లో ధర్నాలు ,పోరాటాలు నిర్వహిస్తాం అని ఈ సందర్భం గా తెలియజేశారు.









