నేటి గదర్ న్యూస్, 28/10/2025
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. కోట రాంబాబు, ఐలూరి వెంకటేశ్వర రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు…..
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను మధిరలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. కోట రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీనన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఈ సందర్భంగా కోరారు. అనంతరం స్థానిక KVR హాస్పిటల్ నందు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అనేకమంది అభిమానులు రక్తదానం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు….
ఈ కార్యక్రమంలో ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి యన్నం కోటేశ్వరరావు, కటికల సీతారాంరెడ్డి, అమరవాది సత్యనారాయణ రెడ్డి, యర్రగుంట రమేష్, మొగిలి అప్పారావు, కపిలవాయి సత్యనారాయణ రాజు, బండి వెంకటేశ్వర్లు, ఐలూరి జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పూర్ణయ్య, సుభాష్, నరసింహారావు, బుర్రా వెంకటనారాయణ, బాధా కృష్ణారెడ్డి, గుండా వీరారెడ్డి, గొడుగు కృష్ణ, నరోత్తమ రెడ్డి, గాలి కృష్ణ, గుండ్ల రత్నబాబు, చిలకా రాజేంద్ర ప్రసాద్, వెంపాటి ప్రభాకర్, షేక్ సలీం, అక్కినపల్లి నాగేశ్వరావు, రాము, సోమ రవికాంత్, తమ్మిశెట్టి బాలకృష్ణ, కాశి కోటేశ్వరరావు, కూరపాటి రమేష్, ఇర్మియా, వెంపాటి రమేష్, దోర్నాల మణిబాబు, తుపాకుల శ్రీనివాసరావు, యర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు









