నేటి గదర్ న్యూస్, వైరా:
ఇటీవల తుఫాను ప్రభావం వల్ల నష్టం జరిగిన బాధిత రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సిపిఎం వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, సిపిఎం వైరా డివిజన్ నాయకులు టాటా నాగేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వైరా మండలం పరిధిలోని అష్ట గుర్తి, గొల్లినపాడు గ్రామాల్లో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను సిపిఎం వైరా రూరల్ బృందం పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాణాల శ్రీనివాసరావు, తోట నాగేశ్వరావు మాట్లాడుతూ వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు తీరా పంటకు చేతికి వచ్చే సమయానికి తుఫాను వల్ల పంటలకు అపార నష్టం వాటిల్లి రైతులకు తీరని అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం జరిగిన పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల నష్ట పరిహారం అపార పంట పంట నష్టం జరిగిన రైతులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని అన్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000 రూపాయలు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. తడిసిన ప్రత్తి,వరి ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వైరా మండల కమిటీ సభ్యులు చిత్తూరు నాగరాజు, చిత్తూరు లక్ష్మణ్, కిలారి శ్రీనివాసరావు, శ్రీరామనేని వెంకటేశ్వరరావు, ఆళ్ల శ్రీనివాసరావు, రైతులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, మురళి తదితరులు పాల్గొన్నారు.









