+91 95819 05907

మణుగూరు బిఆర్ఎస్ ఆఫీస్‌పై దాడి: కాంగ్రెస్ గుండాల చర్యను తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

“కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది” – మెచ్చా నాగేశ్వరరావు ధ్వజం.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ప్రజాస్వామ్యాన్ని, పార్టీ కార్యకర్తల భద్రతను ఉల్లంఘించడమేనని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జిల్లాకు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాడుతుంటే తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు గుండాలుగా మారి పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పరిపాలన నడుస్తుందని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి నీచ పరిస్థితులు చూడలేదని, కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన రెండేళ్లలోనే రాష్ట్రం మొత్తం రౌడీ రాజ్యం నడుపుతోందని, సామాన్య ప్రజలు సైతం భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగే సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు లేదా కార్యకర్తలు ఆఫీస్‌లో ఉండి ఉంటే వారిని హత్య చేసేవారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడితో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోతే, వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయాలని మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !