ఖమ్మం బిజెపి టూ టౌన్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా జ్యోతుల యుగంధర్ నాయుడు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
భారతీయ జనతా పార్టీ ఖమ్మం టూ టౌన్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా జ్యోతుల యుగేందర్ నాయుడుని నియమించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని, ఖమ్మం టూ టౌన్ లో ప్రజా సమస్యలు గుర్తించి ఉద్యమాలు చేపడుతారని, పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి అన్ని వర్గాలలో మరింత విస్తరించడానికి కృషి చేస్తానని, నాపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చిన ఖమ్మం అధ్యక్షులు ధనియకుల వెంకటనారాయణ కి, సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్ కీ ఒక్కలంక సుబ్రహ్మణ్యం కీ మేకల నాగేందర్ కీ నల్లగట్టు ప్రవీణ్కీ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుకీ ఖమ్మం టూ టౌన్,ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు,









