నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గుర్రాల చెరువు గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా యాదవుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో పశు సంపద సృష్టిలో యాదవులదే కీలక పాత్ర అని, వారి వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో యాదవులు తనకు వెన్నుదన్నుగా ఉండి తన రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా మండలంలో యాదవుల భవనం కొరకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంత్రులతో మాట్లాడి త్వరలోనే స్థలం కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి యాదవుల సంఘం బాలబాలికలు చదువులలో, ఆటల పోటీల్లో విద్యలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాదవుల కుటుంబాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.









