సామినేని స్వరాజ్యంను పరామర్శిస్తున్న విజ్జు కృష్ణన్
సామినేని స్వరాజ్యం ను పరామర్శించిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్
సామినేని హంతకులను వెంటనే అరెస్టు చేయాలి
సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు
సిపిఎం పాలిట బ్యూరో సభ్యులు, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ విజ్జు కృష్ణన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో సామినేని రామారావు భార్య స్వరాజ్యం కుమారుడు విజయ్ కుమార్ ను బుధవారం ఆయన పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామినేని రామారావు మృదు స్వభావి అని అన్నారు. రైతు సమస్యలపై తాను రామారావు కలిసి అనేక సంవత్సరాలు పనిచేశామన్నారు. రైతు సమస్యలపై సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు రామారావుని అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. హంతకులను అరెస్టు చేసే వరకు తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పి జగ్గారెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మూడ్ శోభన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మండల కార్యదర్శి రాచబంటి రాము, సిపిఎం బోనకల్ మండల కార్యదర్శి కిలారు సురేష్, తెలంగాణ రైతు సంఘం మధుర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం చింతకాని సీనియర్ నాయకులు వత్సవాయి జానకి రాములు, మునికుంట్ల సుబ్బారావు కొండ్రు జానకిరామయ్య తదితరులు ఉన్నారు.









