*భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం.*
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నేడు డిల్లీ లో ధర్నా. పాల్గొన్ననున్న అంబేద్కర్ వాదులు.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) నవంబర్ 17.
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఢిల్లీలో నవంబర్ 17న నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ నిరసన మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ మెదక్ జిల్లా ఎం ఆర్ పి ఎస్ మరియు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ మాట్లాడుతూ
“భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి పై దాడి జరిగి ఇన్ని రోజులు జరిగిన, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగ వ్యవహరిస్తున్న పోలీసులు ఇది న్యాయవ్యవస్థపై నేరుగా దాడి చేసినట్లే అని యాదగిరి మాదిగ అన్నారు. న్యాయమూర్తి బి.ఆర్. గావాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కాపాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని దళిత నాయకులు అన్నారు.
నేడు భారతదేశంలో దళితులకు రక్షణ, ఆత్మగౌరవం సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.అని
నేడు ఢిల్లీ లో జరిగే దేశభక్తులు మరియు దేశద్రోహుల మధ్య పోరాటం జరుగుతోంది.అని అన్నారు. న్యాయవ్యవస్థకు గౌరవం లేకపోతే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా అందుతుంది?అని ప్రశ్నించారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చెలరేగుతాయి అని అన్నారు.ఈ కార్యక్రమం లో
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.









