మహిళా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబనకు కృషి; ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో చీరల పంపిణీ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) నవంబర్, 23: అశ్వారావుపేట నియోజకవర్గంలో మహిళా అభ్యున్నతికి, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. మహిళా సంఘాల ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి, స్వావలంబనకు ఎంతగానో తోడ్పడుతున్నాయని ఆయన అన్నారు. ఆదివారం అశ్వారావుపేట మండలం వినాయకపురం, ములకలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం తరఫున చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా మహిళలకు చీరలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. అన్ని రంగాలలో మహిళలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. అంతకుముందు, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో సత్యసాయిబాబా దేవాలయాన్ని సందర్శించి శతజయంతి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా, ములకలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాలలో మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, తాండ్ర ప్రభాకర్ రావు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, జూపల్లి రమేష్, బత్తుల అంజి, కారం సుధీర్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









