రిటైర్డ్ ఉపాధ్యాయుల నిరాహార దీక్ష.
పెండింగ్ లో ఉన్న అపరిష్కృత సమస్యల సాధనకై 30 గంటల నిరాహారదీక్ష కు అనుమతి కోరుతూ ఏసీపీ రమణమూర్తి కి వినతి పత్రం .
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు
ఖమ్మం : మార్చ్ 2024 నుండి రిటైరైన ఉద్యోగ ఉపాద్యాయులకు రాష్ట్ర ప్రభత్వం నుండి రావలసిన పెన్షన్ ప్రయోజనాలను చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో పిఆర్టియు పెన్షన్ ప్రయోజనాలను టీఎస్ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం పదవి విరమణ ప్రయోజనాలు , జిపిఎఫ్సొమ్ము , పెండింగ్ లో ఉన్న 5 డీఏ లను , పెండింగ్ బిల్స్ మంజూరి, 2023 పి ఆర్ సి ప్రకటన , జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో పెండింగ్ సమస్యల పరిష్కారం నిమిత్తం ఈనెల 27 ఉదయం 8:00 గంటల నుండి 28 సాయంత్రం 05:00 గంటల వరకు కొత్త కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద దర్నా శిబిరంలో 30 గంటల నిరాహారదీక్షకు అనుమతించ వలసిందిగా కోరుతూ ఏసీపీ రమణమూర్తి కి వినతి అందించారు . ఈ కార్యక్రమంలో పిఆర్టియు టిఎస్ ఖమ్మం జిల్లా శాఖ జిల్లా అధ్యక్షులు కట్టా శేకర్ రావు , మాజీ జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .









