వైరాకు చెందిన ముగ్గ మురళి కృష్ణకు పీహెచ్.డి
కెరీర్ పాయింట్ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం
ముగ్గు మురళీకృష్ణ పీహెచ్.డి ఔషధ విశ్లేషణలో కీలక అడుగు
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా పట్టణానికి చెందిన ముగ్గు వెంకటేశ్వరరావు (లేట్) శారాధాదేవి దంపతుల కుమారుడుముగ్గు మురళి కృష్ణ ఔషధ రంగంలో కీలక విశ్లేషణ చేసి పీహెచ్.డీ సాధించడం వైరా పట్టణానికి గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, నర్సరావుపేటలో ఉన్న ఏ.ఎం. రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ముగ్గు మురళీకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకమైన పీహెచ్.డి. (డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ) పట్టాను విజయవంతంగా అందుకున్నారు. రాజస్థాన్లోని కోటాలో ఉన్న కెరీర్ పాయింట్ యూనివర్శిటీ నుండి ఆయన ఈ పరిశోధనను పూర్తి చేశారు. 2025 నవంబర్ 27వ తేదీన యూనివర్శిటీ ఆయనకు అధికారికంగా డాక్టరేట్ను ప్రదానం చేసింది. ముగ్గు మురళీకృష్ణ సమర్పించిన పరిశోధనా పత్రం యొక్క శీర్షిక “ఎంచుకున్న కొన్ని యాంటీ-హైపర్టెన్సివ్, యాంటీ-వైరల్ ఔషధాలు మరియు వాటి మిశ్రమ ఔషధ మోతాదు రూపాల నిర్ధారణ కోసం విశ్లేషణాత్మక పద్ధతి యొక్క అభివృద్ధి మరియు ధృవీకరణ” ఈ అధ్యయనం అధిక రక్తపోటు, వైరస్ నిరోధక చికిత్సలలో ఉపయోగించే కీలకమైన ఔషధాల యొక్క ఖచ్చితమైన, సమర్థవంతమైన విశ్లేషణాత్మక ప్రమాణాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఈ పద్ధతులు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో నాణ్యతా నియంత్రణ, భద్రతకు దోహదపడతాయి. మురళీకృష్ణ పరిశోధనను ప్రొఫెసర్ టి. రాజకుమారి, ప్రొఫెసర్ కుమారస్వామి సంయుక్తంగా పర్యవేక్షించారు. వారి మార్గదర్శకత్వంలో, ఈ అధ్యయనం ఔషధ విశ్లేషణ రంగంలో ఒక ముఖ్యమైన ముద్ర వేసింది.
ప్రస్తుతం డా. ముగ్గు మురళీకృష్ణ పనిచేస్తున్న ఏ.ఎం. రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్, పలువురు సిబ్బంది ఆయన ఘన విజయాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ డాక్టరేట్ సాధన కళాశాల కీర్తిని పెంచడమే కాకుండా, విద్యార్థులకు, ఇతర అధ్యాపక సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు ప్రముఖులు అభినందించారు.









