మల్కారం సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్
భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి మెచ్చు లలిత
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, డిసెంబర్, 01: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా దమ్మపే మండలం, మల్కారం గ్రామ పంచాయతి లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో శ్రీమతి మెచ్చు లలిత సోమవారం భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని అంకత ఉమ మహేశ్వర రావు మరియు మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి లు దగ్గరుండి పర్యవేక్షించారు. నామినేషన్ ప్రక్రియ మల్కారం గ్రామంలోని శ్రీ రామలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అక్కడి నుండి సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి మెచ్చు లలిత వెంట బారీ ఎత్తున నినాదాలు చేస్తూ, ర్యాలీగా గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సర్పంచ్ పదవి కోసం ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శ్రీమతి మెచ్చు లలిత గెలుపు మల్కారం గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థికి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రూప్ సింగ్, పార్టీ ముఖ్య నాయకులు బత్తుల మురళి, కొండ్రు మురళి, నాగేందర్రావు, తోట మోహన్రావు, మెచ్చు ప్రసాద్, చిట్రూతుల రాము, నల్లపు మోహన్ రావు, వనపర్తి లక్ష్మణరావు, వంకా రాము, మడివి బాబు, ఆకివీడు సుబ్బారావు తో పాటు మల్కారం గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









