ఖమ్మం కాంగ్రెస్ లో నూతన అధ్యక్షుడి బాధ్యతాలు స్వీకారణ.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,శాసనసభ సభ్యులు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్,నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్ నూతన నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, శాసనమండలి మాజి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, చేనేత,హస్తకళల అభివృద్ధి చైర్మన్ నాయుడు సత్యనారాయణ,జిల్లా కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్. హఫీజుద్దీన్, భూక్యా సురేష్ నాయక్, నగర కాంగ్రెస్ అనుబంధ సంఘ సభ్యులు జిల్లా లోని బ్లాక్,మండల, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.









