తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్
ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి మన ఫ్యూచర్ సిటీ
❇️డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులు పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఆతిథ్యానికి అన్నివిధాలుగా ప్రభుత్వం సర్వం సిద్ధమైంది.
❇️ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, నవీన ఆవిష్కరణలకు కేంద్రంగా, తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అన్ని వసతులతో ఆకట్టుకునేలా అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నాయి.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వరుసగా రెండో రోజు ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.
❇️సదస్సు జరిగే చోటా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అనేక డిజిటల్ స్క్రీన్ లు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే అనేక సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్లకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనేక దేశాల నుంచి ప్రముఖులు, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు రానున్ననేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత మరియు నిఘా వ్యవస్థను ఏర్పాట్లు చేయడం జరిగింది.
❇️డిసెంబర్ 8 మధ్యాహ్నం అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమయి డిసెంబర్ 9న సాయంత్రం ముగుస్తాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ వల్ల తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటడం ఖాయం.









