కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కొత్త యాకయ్య గౌడ్,వార్డు సభ్యుల విజయం కాంక్షిస్తూ విస్తృత ప్రచారం
నేటి గదర్, దంతాలపల్లి:మండల పరిధి అగపేట గ్రామపంచాయతీ కి సంబంధించి పంచాయతీ ఎన్నికలలో భాగంగాకాంగ్రెస్ పార్టీ బలపరిచిన కొత్త యాకయ్య గౌడ్,వార్డు సభ్యుల విజయం కాంక్షిస్తూ గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారంనిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొత్త యాకయ్య కు కేటాయించిన కత్తెర గుర్తు, అలాగే యాకయ్యను బలపరుస్తున్న వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచాయన్నారు. మహిళల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న ఘనత ప్రజా పాలన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఆరు గ్యారెంటీ ల అమలుతో ప్రజల కష్టాలు తీరుతున్నాయన్నారు అన్నారు. కొత్త యాకన్న గౌడ్ ను గెలిపిస్తే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ సహకారంతో ఆగపేట అభివృద్ధి లో పరుగులు పెట్టించడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్లు, అగపేట గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









