+91 95819 05907

ఈ- కేవైసీ కారణంతో దేశంలో ఎన్ని రేషన్ కార్డులను రద్దు చేశారు..?

ఈ- కేవైసీ కారణంతో దేశంలో ఎన్ని రేషన్ కార్డులను రద్దు చేశారు..?

* ఆ వివరాలు, ప్రస్తుతం ఉన్న కార్డుల గణాంకాలు తెలపండి
* 14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం లక్ష్యం, బిడ్ల వివరాలేంటి..?
* ఆరో విడత మైనింగ్ లీజులు, తెలంగాణలో వీటి పరిధిలోని ఖనిజ గనుల పరిస్థితి ఏంటి..?
* లోక్ సభలో ప్రస్తావించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
* లిఖితపూర్వక సమాధానాలిచ్చిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నిముబెన్ జయంతి భాయ్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

న్యూ ఢిల్లీ: లబ్ధిదారులు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ (ఈ-కేవైసీ) చేయించుకోలేదనే కారణంతో రాష్ట్రాల వారీగా అక్టోబర్ నాటికి రద్దయిన రేషన్ కార్డులు, ప్రస్తుతం ఉన్న కార్డుల గణాంకాలు తెలపాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా.. బుధవారం ఈ అంశంతో పాటు 14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం లక్ష్యం, బిడ్ల వివరాలు, ఇంకా..ఆరో విడత మైనింగ్ లీజులు, తెలంగాణ రాష్ట్రంలో ఖనిజ గనుల పరిస్థితి తెలపాల్సిందిగా కోరారు. ఈ ప్రశ్నలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి జీ.కిషన్ రెడ్డి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతి భాయ్ బాంభాణియా వేర్వేరుగా లిఖితపూర్వక సమాధానాలిచ్చారు.
తెలంగాణలో మొత్తం రేషన్ కార్డులు 56,60,367, రద్దయినవి 1,40,947
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ సీఏ) నిబంధనల మేరకే లబ్ధిదారుల గుర్తింపు, జాబితాల నిర్వహణ ఉంటుందని దేశంలో అక్టోబర్ నాటికి గణాంకాల ప్రకారం 20,29,52,938 రేషన్ కార్డులు ఉన్నాయని, తెలంగాణలో 56,60,367 మంది కార్డులు కలిగి ఉన్నారని కేంద్ర, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతి భాయ్ బాంభణియా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2020 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 1,40,947 రేషన్ కార్డులు రద్దు అయ్యాయని, అయితే.. అనర్హులు, చనిపోయిన వ్యక్తుల కార్డులే తొలగించామని, ఈ-కేవైసీ కారణంతో ఎక్కడ కూడా కార్డుల తొలగింపు నమోదు కాలేదని వివరించారు.
14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలంలో బిడ్ల సమర్పణకు ఈ నెల 15 వరకు గడువు..
ఏడాదికి 35.41 మిలియన్ టన్నుల ఉత్పత్తిని అందించే సామర్థ్యం కలిగి ఉండి దేశ వ్యాప్తంగా మొత్తం 41 వాణిజ్య బొగ్గు గనులకు సంబంధించిన వేలం ప్రక్రియ అక్టోబర్ 29న ప్రారంభం కాగా.. ఇందులో తెలంగాణ నుంచి ఒక గని ఉందని, ఈనెల 15వ తేదీ నాటికి బిడ్ల సమర్పణకు గడువు ముగుస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి రంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్షమని, ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టీసీ లిమిటెడ్ ద్వారా ఈ – వేలం నిర్వహిస్తామని తెలిపారు. పర్యావరణ రక్షణ చట్టం-1986, అటవీ సంరక్షణ చట్టం – 1980ల ద్వారా జీవవైవిధ్యం, గాలి, నీటి నాణ్యత దెబ్బతినకుండా, ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన పునరావస వసతి సౌకర్యాలు కల్పించేలా చూస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో వేలానికి రెండు ఖనిజ బ్లాక్ లు
ఆరో విడతలో వివిధ రాష్ట్రాల్లో వేలానికి ప్రతిపాదించబడిన ఖనిజ గనుల బ్లాక్ లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో రెండు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. రసాయన మూలకమైన వెనాడియం, ఇంకా.. టైటానియం, అల్యూమినియం, లేటరైట్ ఖనిజ నిక్షేపాల గనులు ఇందులో ఉన్నాయని, ఖచ్చితమైన ప్రణాళికతో.. గనుల ప్రభావిత ప్రాంతాల్లో నిర్వాసితులకు లబ్ధి కలిగేలా ముందుకెళతామని వివరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !