నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 12.
ప్రజా ఉద్యమ నాయకుడు మాసాయిపేట యాదన్న అంటే గ్రామస్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్రస్థాయి వరకు తెలియని వ్యక్తి అంటూ లేరు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో తన పాట ఆట లతో తన జాతిని చైతన్య పరుస్తూనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఏ పిలుపునిచ్చిన తప్పకుండా విజయవంతం చేసేందుకు తన స్వంత జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు ఇన్చార్జిగా వెళ్లి రాష్ట్రాలకు కూడా ఇన్చార్జి వెళ్లిన మాసాయిపేట యాదన్నకు ఉద్యమాలు అంటే ఊపిరి. గద్దర్ అన్న మదిలో యాదన్నకో గుర్తు. ఆ ఉద్యమ స్ఫూర్తితోటే 30 ఏళ్ల ప్రస్తావనంలో మచ్చలేని నాయకునిగా ఎమ్మార్పీఎస్ లో ఎదుగుతూ కృష్ణ మాదిగ బాటలోనే నడుస్తూ ఉద్యమమే ఊపిరిగా ఉంటూ తను ఎన్నో పోరాటాలు చేశాడు. తానుచేసిన సేవలకు గత ప్రభుత్వం అవార్డులతో సహా సత్కరించింది. గత ప్రభుత్వం రచయిత గా కళాకారునిగా సత్కరించింది. యాదన్న మాదిగ అయినా నేటికీ కూడా సాధారణ జీవితమే గడుపుతున్నారు. అది ఒక ఉద్యమకారుని లక్ష్యం. గుండె జబ్బు పిల్లల ఉద్యమం, వృద్ధులు, వితంతులఉద్యమం, రేషన్ కార్డుల కోసం ఉద్యమం, తదితర అనేక ఉద్యమాలు చేశారాయన. సారా పై మొదలైన పాట నేటికీ మూడు పుస్తకాల పాటల రూపం దాల్చడం మన మెదక్ జిల్లా ఉద్యమకారునికి దక్కిన గౌరవం. మాసాయిపేటలో గతంలో జరిగిన రైలు, స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల జ్ఞాపకాలను “రాలిన పూలు” పేరుమీద పాటలు రచించి తల్లిదండ్రుల ఆత్మ గోసను వినిపించాడు. ప్రజాగొంతుక, ప్రజా ఉద్యమ కారులు యాదన్నకు పార్టీలకతీతంగా, సంఘాల కతీతంగా నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాకు అందరికీ ఆత్మీయుడుగా ఉండే మాసాయిపేట యాదగిరి మాదిగన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.









