+91 95819 05907

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

రెండవ విడతలో 2,26,417 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం

కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలించిన జిల్లా కలెక్టర్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతు రెండవ విడత 160 గ్రామ పంచాయతీలకు, 1379 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 91.21 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 27.78 శాతం, 11 గంటలకు 64.32 శాతం, 1 గంట వరకు 85.95 శాతం పోలింగ్ నమోదైందని, ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, వారితో కలిపి మొత్తం ఖమ్మం జిల్లాలో 91.21 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. రెండవ విడత పోలింగ్ నిర్వహించిన కామేపల్లి మండలంలో 87.03 శాతం, ఖమ్మం రూరల్ మండలంలో 93.76 శాతం, కూసుమంచి మండలంలో 90.92 శాతం, ముదిగొండ మండలంలో 91.52 శాతం, నేలకొండపల్లి మండలంలో 91.69 శాతం, తిరుమలాయపాలెం మండలంలో 91.57 శాతం పోలింగ్ నమోదైందని, మొత్తం 2 లక్షల 48 వేల 239 మంది ఓటర్లకు గాను 2 లక్షల 26 వేల 417 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని, మొత్తంగా రెండవ విడతలో 91.21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కలెక్టర్ అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కలెక్టరేట్ నుంచి నిరంతరం మానిటరింగ్ చేయడం జరిగిందని, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కౌంటింగ్ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 6 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, సిపిఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాస రావు, రెవెన్యూ సిబ్బంది,
టెక్నికల్ టీం సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !