+91 95819 05907

ఖమ్మం మధ్య గేటు వద్ద ఆర్వోబికి గ్రీన్ సిగ్నల్.

ఖమ్మం మధ్య గేటు వద్ద ఆర్వోబికి గ్రీన్ సిగ్నల్.

– భూ సేకరణ కోసం వేచి చూస్తున్నాం
– రాష్ట్ర ప్రభుత్వం వెంటపడుతున్నాం
– రాగానే పనులు మొదలు పెడతాం
– ఎంపీ వద్దిరాజు వినతికి రైల్వే అధికారుల స్పందన.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం నగరంలో రెండు ప్రధాన వ్యాపార కూడళ్లు గాంధీ చౌక్, కమాన్ బజార్లను కలిపే మధ్యగేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబి) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే అందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి, తమ అప్పగిస్తే అక్కడ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు.
ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల కోరిక మేరకు మధ్య గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోరుతూ.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైల్వే జీఎం కు గత నెలలో ఓ వినతిపత్రం అందజేశారు. ఆ మేరకు రైల్వే జీఎం స్పందించి ఆయకు ప్రత్యుత్తరం రాశారు. ఖమ్మం – పందిళ్ళపల్లి మధ్యలో 104 లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆర్వోబి
నిర్మాణం భూ సేకరణ అంశంతో ముడిపడి ఉన్నందున, అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రైల్వే జీఎం తెలియజేశారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తన లేఖలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు స్పష్టం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !