ఖమ్మం జిల్లాలో పరిశ్రమల విస్తరణకు వేగవంతమైన చర్యలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మంగళవారం రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ (టిజిఐఐసి) కు కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. పరిశ్రమలు నెలకొల్పడానికి స్థలం అనుకూలమైన పరిస్థితులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కేటాయించిన భూమి యొక్క విస్తీర్ణం, సరిహద్దులు, రహదారి అనుసంధానం, మౌళిక సదుపాయాల లభ్యతను సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రస్తుతం ఉన్న మొత్తం స్థలంను సేత్వార్, కాస్రా, నక్షా మ్యాప్ లను ఆధారంగా సమగ్రంగా సర్వే చేసి సరిహద్దులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాను పరిశ్రమలకు అనుకూల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నదని, టిజిఐఐసి ద్వారా కేటాయించిన భూములను సమర్థవంతంగా వినియోగించి ఆర్థిక అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మైనింగ్ ఎడీ సాయినాథ్, పరిశ్రమల శాఖ జీఎం సీతారాం నాయక్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









