జమ్మిగూడెంలో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్: మాజీ ఎమ్మెల్యే మెచ్చాను కలిసిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 16: అశ్వారావుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. అధికారంలో లేకపోయినా బెదిరింపులు, దౌర్జన్యాలను ఎదుర్కొని మండలంలోని 7 పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో జమ్మిగూడెం పంచాయతీలో సర్పంచ్గా ఘనవిజయం సాధించిన ముద్దిన వెంకట నర్సమ్మ, ఉప సర్పంచ్ డండి వెంకటేశ్వరరావు మరియు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు దానపు రాజమ్మ, మిద్దిన రాంబాబు, దానపు భాగ్యరాజు, గణప పుల్లమ్మ, రెడ్డి జ్యోతి, సోమిని రాజ్యలక్ష్మి లు గెలిచిన రెండు రోజుల అనంతరం మంగళవారం మండల నాయకులు కాసాని చంద్రం ఆధ్వర్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు గెలిచిన అభ్యర్థులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసి అఖండ విజయాన్ని అందించిన నాయకులను, కార్యకర్తలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ముద్దిన కొండయ్య, ముద్దిన రాములులతో పాటు నాయకులు రాజిని నాగేశ్వరావు, దానపు జగపతి, పెన్నాడా చిట్టిబాబు, నక్కా సూరిబాబు, ముద్దిన వెంకటేశ్వరావు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.









