* నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఐదు నియోజకవర్గాల గ్రామపంచాయతీ నూతన ప్రజా ప్రతినిధులతో భేటీ.
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్తగూడెం నియోజవర్గంలోని చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలిసి అభినందించనున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధులు అందరూ సకాలంలో హాజరుకావాలని దయాకర్ రెడ్డి కోరారు. అదే విధంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా మంత్రి అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు.









