ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్. హఫీజుద్దీన్ మరియు భూక్యా సురేష్ నాయక్..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
హైదరాబాద్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ హఫీజుద్దీన్ మరియు భూక్యా సురేష్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా పార్టీ కార్యక్రమాలు గురించి అడిగారు..కాంగ్రెస్ పార్టీ కమిటీ లు వెంటనే పూర్తి చేయాలని వారు కోరారు..నామినేటెడ్ పదవులు వెంటనే పూర్తి చేసినట్లైతే కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని వారు తెలియజేశారు.వారితో పాటు టీపివైసి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బెల్లంకొండ. శరత్, ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు వెంపటి. వెంకన్న, భద్ర చారి పాల్గొన్నారు









